Neeti cheppina donga maripoyina dhanikudu moral story

నీతి చెప్పిన దొంగ – మారిపోయిన ధనికుడు

by Manasa Kundurthi

ఒక గ్రామంలో రామయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతనికి సకల సౌకర్యాలు ఉన్నా, తాను సంపాదించిన ధనాన్ని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. దానధర్మాలు చేయకుండా, తనకు మాత్రమే ఉపయోగపడేలా పొదుపుగా ఉండేవాడు.

ఒక రోజు, రాత్రివేళ ఒక దొంగ రామయ్య ఇంటిలోకి చొరబడి, విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయి అని వెతుకుతున్నాడు. అప్పటికే రామయ్య మేల్కొని, దొంగను పట్టుకుని గట్టిగా అరవడం ప్రారంభించాడు.

అప్పుడా దొంగ రామయ్యను నిలిపివేసి ఇలా చెప్పాడు:

“స్వామీ! మీరు అనవసరంగా అరవకండి. నేను మీకు ఒక ముఖ్యమైన నీతి చెబుతాను. మీరు వింటే మీకు మేలు జరుగుతుంది.”

ఆ మాటలు విన్న రామయ్య ఆసక్తిగా, “ఏమిటది?” అని అడిగాడు.

దొంగ చిరునవ్వుతో ఇలా చెప్పాడు:

“ఈ లోకంలో మనం సంపాదించిన ధనం, ఐశ్వర్యం మనతో పాటు ఉండదు. మనం మరణించిన తరువాత అది ఈ లోకానికే మిగిలిపోతుంది. కానీ మనం మంచి పనులు చేస్తే, దానధర్మాలు చేస్తే, అది మన పేరు నిలబెడుతుంది. మీరు ధనం ఎక్కువుగా ఉంచుకునే బదులుగా, పేదవారికి సహాయం చేయండి. అంతే గాక, ధనం ఎప్పుడూ నిలిచి ఉండదు. కాలానుగుణంగా అది చేతులు మారుతుంది.”

ఆ మాటలు విన్న రామయ్య కాస్త కంగారుపడిపోయాడు. కానీ ఆలోచించి, దొంగ చెప్పిన మాటల్లో అర్ధం ఉందని గ్రహించాడు. ఆ తరువాత నుంచి రామయ్య తన ధనాన్ని మంచి పనులకు ఉపయోగించడం ప్రారంభించాడు.

నీతి:
ధనం సర్వస్వం కాదు. దానిని సముచితంగా ఉపయోగిస్తే, మన పేరు తరతరాలకు నిలుస్తుంది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలు ను చూడండి.

You may also like