Home » కాలుష్యం వల్ల ఏటా 33 వేల మంది చనిపోతున్నారు

కాలుష్యం వల్ల ఏటా 33 వేల మంది చనిపోతున్నారు

by Shalini D
0 comments
33 thousand people die every year due to pollution

కాలుష్యం వల్ల భారత్‌లోని 10 నగరాల్లో ఏటా సగటున 33వేల మంది చనిపోతున్నారని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయన నివేదిక తెలిపింది. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో 2008-2019 మధ్య ఉన్న సమాచారం ఆధారంగా అధ్యయనాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. పౌరులను కాపాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను భారత్ కచ్చితంగా అనుసరించాలని హెచ్చరించింది. అత్యధికంగా ఢిల్లీలో ఏడాదికి 12వేలమంది మరణిస్తున్నారని స్పష్టం చేసింది.

రాజధాని దిల్లీతో సహా వాయు కాలుష్యంతో నిండిన భారతీయ నగరాలు చాలా ఉన్నాయి. వాయు కాలుష్యంతో బాధపడుతున్నాయి. ఇక్కడ నివాసితుల ఊపిరితిత్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆరోగ్యానికి పెరుగుతున్న ముప్పును ఇప్పటికీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడే అర్థం చేసుకోకుంటే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

కొత్త అధ్యయనం ప్రకారం.. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే, సిమ్లా, వారణాసి నగరాల్లో PM2.5 కాలుష్య కారకాలుగా పిలువబడే క్యాన్సర్‌కు కారణమయ్యే మైక్రోపార్టికల్స్ స్థాయిలను భారత నేతృత్వంలోని బృందం పరిశీలించింది. దీని కారణంగా ఇలాంటి నగరాల్లో వాయు కాలుష్యంతో మరణాల సంఖ్య పెరిగింది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.