Home » శ్రీ కృష్ణ (Srikrishna) పరమాత్ముడి చిట్టచివరి సందేశం తప్పకుండా చదవండి

శ్రీ కృష్ణ (Srikrishna) పరమాత్ముడి చిట్టచివరి సందేశం తప్పకుండా చదవండి

by Vishnu Veera
523 views
Srikrishna paramatmudi citta civari sandesam

శ్రీకృష్ణుడి మాటలు :

ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒక రోజు శ్రీ కృష్ణుఁడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారక నగరమునువిడిచి పెట్టేయండి చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు. అయన కృష్ణడు దగ్గరికి వెళ్లి

ఉద్ధవుడు శ్రీకృష్ణుడితో చెపుతున్న మాటలు :

కృష్ణ మేము నీతో కలసి ఆడుకునం , పాడుకున్నాము ,అన్నం తిన్నాము ,సంతోషం గా గడిపాము . ఇలాంటి కృష్ణ అవతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను. నీను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకు ఏదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు. అప్పుడు శ్రీ కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలను ఉద్ధవుడు తో ప్రస్తావన చేశాడు.
ఇది మనం అందరం కూడా తెలుసుకొని జీవితంలో పాటించవలసిన శ్రీ కృష్ణ పరమాత్ముడి చిట్టచివరి సందేశం.
దీని తరువాత ఇంకా శ్రీకృష్ణడు లోకోపకారం కోసం ఎమీ మాట్లడలేదు. ఇది లోకమును ఉద్దరించడానికి ఉదువుడిని అడుపెట్టి చెప్పాడు.

శ్రీ కృష్ణ పరమాత్మ ఉద్ధవుడు తో చెపుతున్న మాటలు:

ఉద్దవా నేటికీ 7వ రాత్రి కలియుగం ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రి లోపల ధ్వారాక పట్టణమును సముద్రం ముంచేస్తుంది సముద్రం గర్భంలోకి ద్వారక పట్టణము వెళ్లిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరు మరణిస్తారు.
తదంతరం కలియాగం ప్రవేసేస్తుంది. కలియుగం మొదలవుతూనే మనుషులు యందు 2 లక్షణాలు పుట్టుకొస్తాయి. 1 అపారమయిన కోరికలు 2 వీపరీతమయిన కోపం ఎవరు కూడా తాను తప్పు తాను తలిసికొనే ప్రయాతం చేయరు. కోరికలు చేత అపారమైన కోపం చేత తాము ఆయిష్షు తామే తాగించుకుంటారు. కోపం చేతను అపారమైన కోరికలు చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్లకు వ్యాధులు పొటమరిచి ఆయిష్షు తగ్గించి వేస్తాయి. కాలియాగం లో ఉండే మనుసులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జనల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదములు వదిలిపెట్టెసి తమంత తాముగా పాషండ మతములను కౌగిలించుకోని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గాలులో వెళ్లిపోతారు. అల్పాయుదంతంతో జీవిస్తారు. రాజా యోగం చేయడం మరచిపోతారు. తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియ యోగం లేదా నేనున్నా స్థితికి చేర్చే లయయోగం ఒక్కటే ఉన్నది అని తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఆడామురాలుకు ప్రాధాన్యతనిస్తారు . ఉపవాసమును తమ మనుసును సంస్కరించుకోవడానికి,ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రాను రాను కాలియాగం లో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడుతారు. ఆచారం అక్కర్లేదు పూజలు ఏమి ఉంటాయో వాటి యందు మక్కువ చూపుతారు. వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటారు అని తెలుసుకోరు. అంతశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారములను మనసును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి. ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదు ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దాని వలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియములకు వాసులు అయిపోతారు. రాజులే ప్రజల సోము దోచుకుంటారు. ప్రజలు రాజులమీద తిరగబడుతారు. ఎవడికి పాండిత్యమును బట్టి యోగత్యను బట్టి గర్వం ఉండదు. కలియాగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. యంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు.

భగవంతున్ని పాదములను గట్టిగా పట్టుకొని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియాగంలో ప్రజలు అందరూ గూళ్ళు చుట్టూ తిరిగే వాళ్లే కాని, అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సహము చూపారు. అటువంటి ఆశ్రములలో కాలు పెట్టాలి. అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడకి వెళ్లకుండా హీనమైన భక్తి తో
ఎవరి పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరు యందు బేధము చూస్తారు. కాబట్టి నాకు ఒక్క మాట చెప్తాను బాగా గుర్తుపెట్టుకో. ఇంద్రియములు చేత ఏది సుఖమును ఇస్తుందో అది అంత డోలా. అది మనుషులు జన్మను పాడుచేయడానికి వచ్చింది గుర్తుపెట్టుకో దీని బదరిక ఆశ్రమమునకు వెళ్లిపో.

కలియాగంలో గాని ఏ యాగం లో గని శ్యాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ధాన్యం చేయడం విడిచిపెటకు. నీ దారి శ్యాస దారి కావాలి .శ్యాస దారి యే నా దగ్గరికి నీను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి సవ్య కిక్రియ లోను నేను ఉన్నాను వుంటాను. ఇది విశ్వసించు ఉద్దవ. ప్రయత్నపూర్వకంగా కొంత సేపు మౌనంగా ఉండటానికి ప్రయత్నించు. మావునము ధ్యానం ఇంద్రియ నిగ్రహము చేయట ,నోటిలోని మౌనం మనసు లోని మౌనంతో ధాన్యంలో కుర్చునట, ఈశ్వరుని సేవించుట. మొదగాను పనులను ఎవరు పాటించటం మొదలు పెట్టారో వారు మెట్లుఎక్కడం మొదలుపెడుతారు. ఇది శ్రీ కృష్ణ పరమాత్ము ఉద్ధవుడుకి ఇచ్చిన సందేశం .
ఈ సందేశం ఉద్ధవుడు కె అనుకుంటే మీ పారుపాటు. ఇది మన అందరి కోసం శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చుడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.