అన్నమాచార్యుల జననం, బాల్యం:
తిరుపతి సమీపంలోని తాళ్ళపాక అనే గ్రామంలో నారాయణయ్య అనే ఒక బాలుడు ఉండేవాడు. అతను చిన్నతనంలో చదువుకోవడానికి గురుకులానికి తల్లితండ్రులు పంపించారు, కానీ ఆ బాలుడికి చదువు రాక చాలా ఇబ్బందిపడేవాడు. గురుకులానికి వెళ్లాలంటే బయపడేవాడు, ఒకసారి తన తండ్రి, గురువులు వేసే శిక్షలకు భయపడి, ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నాడు. ఆ ఊరిలోని చింతలమ్మ గుడి పక్కన ఉన్న పుట్టలో చేతిని పెట్టి పాము కాటుకు గురికావాలని ప్రయత్నిస్తుండగా, వెంటనే అమ్మవారు ఒక స్త్రీ రూపంలో వచ్చి అతనికి మార్గదర్శనం చేశారు. అమ్మవారు నారాయణయ్యతో, అతని భవిష్యత్ లో నీ మనుమడు, వైకుంఠం నుండి వచ్చిన ఒక ఆత్మ అని, అతని నీ వంశంలో జన్మిస్తాడని, నీ వంశం ఉండాలని చెప్తుంది.
కాలక్రమేణా, నారాయణయ్యకు నారాయణ సూర్య అనే కుమారుడు జన్మించాడు, అతను లక్కమాంబను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు చాలా కాలం పిల్లలు లేరు. వారు అనేక పూజలు చేసి, పుణ్యక్షేత్రాలు సందర్శించినప్పటికీ సంతానం కలగలేదు. తమ కర్మ ఇంకా తొలగిపోలేదని గ్రహించి, వారు తిరుమల వెళ్లి ప్రతి అడుగుకు ఒక దండం సమర్పిస్తూ ‘అడుగడుగు దండాలవాడ గోవింద’ నామంతో నమస్కారాలు చేశారు. ఈ వ్రతం పూర్తయిన తర్వాత, అలసటతో ఆలయ ప్రాంగణంలో నిద్రపోయారు. అప్పుడు వారికి కలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కనిపించి, లక్కమాంబకు తన దివ్య ఖడ్గం “నందకం” ఇచ్చి, వారికి సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు.
స్వామివారి నందక ఖడ్గం ఆశీర్వాదంతో, అన్నమాచార్యులు వైశాఖ పౌర్ణమి నాడు మే 9, 1408న జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు భగవంతుని నామాలను స్మరించడం అంటే ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆయన తనకు తానుగా దేవతలను స్తుతిస్తూ పాటలు, కీర్తనలు పాడేవారు. ఆయన తల్లిదండ్రులు ఇతడు పని బాట లేకుండా పాటలు పాడుతున్నాడు అని దీనిని పిచ్చిపనిగా భావించి, పది సంవత్సరాల వయస్సులో ఆయనను క్రమశిక్షణ నేర్పడానికి పశువులకు గడ్డి కోయడానికి అడవికి పంపారు. గడ్డి కోస్తూ, అన్నమాచార్యులు అనుకోకుండా తన వేలును గాయపరుచుకున్నారు, రక్తం కారడం మొదలుపెట్టింది. అప్పుడే తిరుమల ఎక్కుతున్న కొంతమంది యాత్రికులను చూసి, వారితో కలిసి తిరుమల వెళ్ళాడు.
సినిమాకు వాస్తవానికి తేడాలు:
‘అన్నమయ్య’ సినిమాలో అన్నమాచార్యులను యువతితో తిరుగుతున్నట్లు చూపించారు, కానీ ఇది వాస్తవం కాదు. వైకుంఠం నుండి వచ్చిన ఆత్మ అయిన అన్నమాచార్యులు అలాంటి పనులకు పాల్పడరని, సినిమాలో చూపించిన రొమాంటిక్ సన్నివేశాలు శ్రీరంగంకు చెందిన ధనుర్దాసు కథ అని మూలాలు చెబుతున్నాయి. అన్నమాచార్యులవారు పది సంవత్సరాల వయస్సులోనే తిరుమల వెళ్లిపోయారు.
తిరుమల ప్రయాణం, దైవ దర్శనాలు:
తిరుమల కొండ ఎక్కుతుండగా, చిన్న వయస్సు లో ఉన్న అన్నమాచార్యులు తోటివారితోపాటు కొండను ఎక్కలేక వెనకబడి, జారీ పడిపోయారు. అప్పుడు అమ్మవారు అలివేలు మంగమ్మ మారువేషంలో వచ్చి, కొండ పవిత్రతను వివరిస్తూ తన పాదరక్షలు తీయమని సలహా ఇచ్చారు. అమ్మవారు అన్నమాచార్యులకు స్వామివారి ప్రసాదాన్ని స్వయంగా అందించారు, ఇది ఆయన 32,000 కీర్తనలు రచించడానికి ప్రేరణనిచ్చి ఉండవచ్చు. అమ్మవారు ప్రసాదించిన ఆ శక్తితో దైవిక ఆనందంతో నిండిన ఆయన కొండ ఎక్కి, స్వామివారి దర్శనం చేసుకుని, సహజంగానే “అదివో అల్లదివో” అనే కీర్తనను పాడారు.
ఒక సందర్భంలో, అన్నమాచార్యులు కీర్తనలు పాడుతూ శరీర స్పృహ కోల్పోయి ఆ తన్మయత్నంలో మునిగిపోయారు. తిరిగి సృహ వచ్చేసరికి రాత్రి కావడంతో ఆలయం మూసివేయబడింది. ఆయన అక్కడ ఉన్న అర్చకులను వేడుకున్నప్పటికీ, అర్చకులు ఆలయం తెరిచేది లేదని చెప్పారు. అప్పుడు ఆలయం వెలుపల కూర్చుని ఆయన భక్తి గీతం పాడటం ప్రారంభించగానే, ఆలయం తాళం పడిపోయి, తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. ఈ అద్భుతమైన సంఘటనతో అర్చకులు అన్నమాచార్యులు సామాన్య బాలుడు కాదని గ్రహించారు. అప్పటి నుండి ఆయనకు ఆలయంలోకి ప్రవేశం లభించింది, అక్కడ ఆయన ప్రతిరోజూ కీర్తనలు పాడేవారు.
వివాహం, తదుపరి జీవితం:
అన్నమాచార్యులు తిరుమల కొండపైనే పెరిగి పెద్దవారయ్యారు. సంవత్సరాల తరబడి ఆయన తల్లిదండ్రులు వెతుకిన తరువాత తిరుమల కొండమీద ఉన్నాడని తెలుసుకొన్నారు. తిరుమలకు వచ్చేవారిని, స్వామివారి దర్శన సమయంలో అన్నమాచార్యులు భక్తి గీతాలతో ప్రజలను మంత్రముగ్దులను చేయడం చూసి, వారు సంతోషించారు. వారు తమ కుమారుడిని ఇంటికి తిరిగి వచ్చి వివాహం చేసుకోమని సూచించారు, కానీ అన్నమాచార్యులు స్వామి సేవకు అంకితం కావడానికి అవివాహితుడిగా ఉండాలని కోరుకున్నారు. తర్వాత, కలలో వేంకటేశ్వరస్వామి అన్నమాచార్యులకు కనిపించి, తల్లిదండ్రుల సలహా విని వివాహం చేసుకోమని చెప్పారు. అప్పుడు అన్నమాచార్యులు తిరుమలమ్మ, అక్కలమ్మలను వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత, అహోబిలం క్షేత్రంలో, అన్నమాచార్యులు శతకోప ముని నుండి నరసింహ మంత్రాన్ని పొందారు. ఆయన ఆ మంత్రాన్ని గొప్ప భక్తితో అభ్యసించగా, నరసింహ స్వామి ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. అన్నమాచార్యులు తిరుమల కొండపై వేల సంఖ్యలో కీర్తనలు రచించడం కొనసాగించారు.
రాజభవనంలో అనుభవం:
అన్నమాచార్యులు వృద్ధాప్యంలో ఉండగా, పెనుగొండ రాజు నరసింహ రాయలు తిరుమలను సందర్శించారు. రాజు అన్నమాచార్యుల కీర్తనలకు మంత్రముగ్ధులై, ఆయనను తన రాజభవనంలో ఉండమని అభ్యర్థించారు. అన్నమాచార్యులు ఒప్పుకుని రాజదర్బారులో చేరారు. అక్కడ ఆయన రోజువారీ వేంకటేశ్వరస్వామికి అంకితం చేసిన కీర్తనలను ఆలపించేవారు. ఒకసారి అన్నమాచార్యులు “ఎమోకో చిగురుటధరమున” అనే శృంగార కీర్తనను రచించారు. ఈ కీర్తనతో ఆకర్షితుడైన రాజు, తనను స్తుతిస్తూ అదే విధంగా పాటలు పాడమని అన్నమాచార్యులను కోరారు. అయితే, అన్నమాచార్యులు నిరాకరించారు, తన నాలుక విష్ణువును స్తుతించడానికి మాత్రమే ఉందని, మానవులను ప్రశంసించడానికి కాదని పేర్కొన్నారు. కోపించిన రాజు అన్నమాచార్యులను బంధించి, సంకెళ్లతో కట్టించాడు. అయితే, అన్నమాచార్యులు నరసింహ స్వామిని స్తుతిస్తూ పాడగానే, సంకెళ్లు అద్భుతంగా తెగిపోయాయి. ఈ అద్భుతాన్ని చూసి, రాజు పశ్చాత్తాపపడి, అన్నమాచార్యుల క్షమాపణ కోరాడు. అన్నమాచార్యులు, తాను స్వామివారి దైవిక సభకు చెందినవాడని, రాజు సభకు కాదని చెప్పి, వెంటనే తిరుమల కొండపైన ఆనంద నిలయానికి తిరిగి పంపించారు.
అన్నమాచార్యుల వారసత్వం, నిర్యాణం:
అన్నమాచార్యులు తిరిగి తన కీర్తనలు పాడటం ప్రారంభించగానే, వేంకటేశ్వరస్వామి స్వయంగా సంతోషించి, ఆయన కీర్తనల కోసం తాను ఎంతగానో ఎదురుచూశానని చెప్పారు. స్వామి అన్నమాచార్యులకు ఒక వరం ఇచ్చారు, తాను అన్నమాచార్యుల కీర్తనలు విన్న తర్వాతే రాత్రి నిద్రకు ఉపక్రమిస్తానని ప్రకటించారు. స్వామి అన్నమాచార్యులు ఎల్లప్పుడూ తనతో తిరుమల కొండపై ఉండాలని కోరారు. ఈ అభ్యాసం నేటికీ కొనసాగుతోంది, అన్నమాచార్యుల వారసులు ప్రతిరోజూ స్వామి కోసం రెండు కీర్తనలు ఆలపిస్తారు.
అన్నమాచార్యులు దాదాపు 95 సంవత్సరాలు జీవించారు, ఈ సమయంలో ఆయన అద్భుతమైన 32,000 కీర్తనలను రచించారు. ఆయన తన కీర్తనలన్నింటినీ రాగి పలకలపై ఆనంద నిలయంలో భద్రపరిచారు. ఆయన ఈ 32,000 కీర్తనలను స్వామికి సమర్పించారు, తన సమర్పణలు పూలు కాదని, తన రచనలని పేర్కొన్నారు. చివరికి, 1503లో ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు, అన్నమాచార్యులు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి, స్వామివారి దివ్య ఖడ్గం నందకంలో లీనమయ్యారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.