Home » సింహం మరియు తెలివైన కుందేలు – నీతి కథ

సింహం మరియు తెలివైన కుందేలు – నీతి కథ

by Rahila SK
1.3K views

ఒకప్పుడ్డు ఒక అరణ్యంలో ఒక సింహం ఉండేది. అది చాల గర్వంగా ఉండేది. ప్రతిరోజు అది అరణ్యంలో ఉన్న ఇతర జంతువులను పట్టుకుని తినేది. అందువల్ల అన్ని జంతువూలు భయంతో జీవించేవి.

ఒకరోజు, అరణ్యంలో ఉన్న జంతువులు ఒక సమావేశం నిర్వహించాయి. అన్ని జంతువులూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. మనం సింహాని ఒక రోజుకు ఒక జంతువును పంపాలి. అప్పుడు మనం భయపడకుండా జీవించగలము అని ఒక జంతువూ చెప్పింది. అందరు ఆ నిర్ణయాన్ని ఒప్పుకున్నారు.

ఇలా ప్రతి రోజు ఒక జంతువూ సింహానికి విందు గాను వెళ్ళేది ఒక రోజు,కుందేలు తన వంతు వచ్చిందని సింహం దగ్గరికి వెళ్ళింది. కానీ కుందేలు చాల తెలివిగా ధైరంగ్య, ఉండేది. అది తనను తానూ రక్షించుకోవాలని నిర్ణయించుకుంది.కుందేలు తన ప్రయాణంలో ఆలోచన చేసింది. చివరకు అది సింహం దగ్గరికి ఆలస్యంగా చేరుకుంది సింహం చాల కోపంతో ఆ కుందేలు మీద గర్జించింది, నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? కుందేలు నిదానంగా అది ఓ మహారాజ న ఆలస్యానికి ఒక కారణం ఉంది నా మార్గంలో ఇంకొక సింహం కనిపించింది. అది కూడా నన్ను తినాలనుకుంది.

సింహం ఆశ్చర్యాంగ అడిగింది ఇంకొక సింహం ఎక్కడుంది అది? కుందేలు తెలివిగా నాతో రండి నేను మీకు చూపిస్తాను అంది సింహం కుందేలు చెప్పిన చోటుకి వెళ్ళింది అక్కడ ఒక బావి కనిపించింది. కుందేలు సింహానికి ఆ బావిలో కనిపించే నీటిని చూపించి ఇదిగో ఆ సింహం నీటిలో ఉంది అంది.

సింహం ఆ బావిలోకి చూసింది బావి ప్రతిబింబం నీటిలో కనిపిచింది. సింహం ఆ ప్రతిబింబాన్ని ఇంకొక సింహాని భావించి. కోపంతో గర్జించి బావిలోకి దూకింది దూకిన సింహం తిరిగి పైకి రాలేకపోయింది. అలా కుందేలు తన తెలివితో సింహాన్ని ఓడించి, అన్ని జంతువులను రక్షించింది.

నీతి : అందుకని మనం ఏ పరిస్థితైనా తెలివిగా ధైర్యంగా ఎదుర్కొంటే విజయం సాధించగలం.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ నీతి కథలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.