శంభాలా రహస్యాలు: కల్కి సినిమాలో ప్రస్తావించిన “శంభాలా” గురించే చాలా మంది ప్రజలలో ఆసక్తి పెరిగింది. అసలు ఈ శంభాలా ఎక్కడ ఉంటుంది? ఎందుకు అంతా అక్కడికి పోవాలని కోరుకుంటారు? దీని వెనక నిజమైన కథ ఏంటి? మనం నిజంగా శంభాలా కి వెళ్లగలమా? లేక ఈ అంతా కల్పిత కధలేనా? అక్కడ ఎవరు ఉంటారు?
చాలామందికి శంభాలా అనగానే ఓ అద్భుత నగరంలా అనిపిస్తుంది. కానీ నిజానికి అది నగరమే కాదు. కొంతమంది ఇది హిమాలయాల్లో ఎక్కడో ఉందని అంటారు. కానీ అది హిమాలయాల్లోనూ ఉండదని మరికొంతమంది చెబుతారు. ఇలా అనేక భిన్నమైన కథలు, దానిపై నమ్మకాలు ఉన్నాయి.
శంభాలా పేరు చాలా రకాల రహస్యాలతో నిండిపోయింది – పిరమిడ్లు, మన పురాణాలు, అలెగ్జాండర్ మహా చక్రవర్తి, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, కలియుగం మొదలైన వాటితో దీని సంబంధం ఉందంటారు. కొన్ని అసలే సంబంధం లేనట్లున్నా, అన్నీ కలిసి శంభాలా మిస్టరీని మరింత ఆసక్తికరంగా మార్చేశాయి.
ఈ కథల్లో ఎంత వరకు నిజం? మనం ఎప్పటికైనా శంభాలా కు వెళ్ళగలమా ? లేక అది మన కలల లోకంలో ఉండిపోయే ఒక మాయానగరమేనా? అనే విషయాలను తెలుసుకుందాం రండి!.
కల్కి అవతారంతో శంభాలా సంబంధం:
భాగవతం లో ఉన్న 12వ కాండ 2వ అధ్యాయము 18వ వచనం లోను కల్కి పురాణంలో ఉన్న 2వ అధ్యాయము 15వ వచనం లోను ఒక గొప్ప రహస్యాన్ని మనకు చెబుతాయి. ఆ శ్లోకాల ప్రకారం… భగవంతుడు విష్ణుమూర్తి తన 10వ అవతారంగా కల్కిగా ఈ భూమిపై అవతరించబోతున్నాడు. ఈ కల్కి అవతారం కలియుగం చివరలో, మానవాళి పూర్తిగా అధర్మం వైపు మళ్ళిపోయిన సమయానికి సంభవించనుంది.
కల్కి, “సుమతి” అనే ఓ ఆవిడ గర్భంలో జన్మిస్తాడు. శంభాలా అనే స్థలంలో కల్కి కి ఆవిడ జన్మిస్తుంది. పరశురాముడు కల్కి కి అన్ని వేదాలు యుద్ధ విద్యలు నేర్పిస్తాడని రాసి ఉంది. కల్కి శంభాలా కి 25 వ రాజు.
ఎప్పుడైతే కలియుగాంతము లో ప్రజలు ధర్మాన్ని పూర్తిగా వదిలేస్తారో, ఎప్పుడైతే ప్రజలను పాలించాల్సిన రాజులు దొంగలు అవుతారో, ఎప్పుడైతే దారుణాలు పెరుగుతుంటాయో, అప్పుడు… పంచభూతాలా ప్రభావం కలిగిన ఓ అద్భుతమైన ఖడ్గాన్ని ధరించిన కల్కి, తెల్ల గుర్రం మీద శంభాలా నుండి బయలుదేరుతాడు.
ఆయనతో పాటు లక్షలాది ధర్మసేనలుంటాయి. కల్కి రాకతో బురదలో మునిగిపోయిన ఈ భూమిని పవిత్రం చేస్తాడు. అధర్మాన్ని నిర్మూలించి, మళ్లీ ధర్మం నాలుగు పాదాల పై నడిచేలా చేస్తాడు. అప్పుడే ఈ కలియుగం ముగుస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి.
శంభాలా సామ్రాజ్యం – నగరమా, రాజ్యమా?
చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది – శంభాలా అంటే ఒక సాధారణ నగరం అనుకుంటారు. కానీ నిజానికి అది నగరం కాదు… ఓ మహా సామ్రాజ్యం!
ఆ శంభాలా సామ్రాజ్యంలో ఎనిమిది ముఖ్యమైన ప్రాంతాలు ఉంటాయట. వాటి మధ్యలో, అంటే అక్షరాలా కేంద్రబిందువు ప్రాంతం లో ఒక అద్భుతమైన స్ఫటిక (క్రిస్టల్) పర్వతం ఉంటుంది – అది ఏకంగా తొమ్మిది అంతస్తుల ఎత్తు ఉంటుంది. ఆ పర్వతం పైనే, ఒక కమలాకారంలో, కాలచక్ర మండలం ఉంటుంది. దీన్ని శంభాలా తొలి రాజైన “సుచతుండ్రుడు” నిర్మించాడని పురాణ కథలు చెబుతాయి. ఈ శంభాలా సామ్రాజ్యంలో రాజధాని పేరు – కలాపా నగరం.
పిరమిడ్లు & శంభాలా: ప్రాచీన నిర్మాణాల రహస్యాలు
శంభాలా గురించి మాట్లాడే ముందు ఇంకొక విషయం ఏంటంటే పిరమిడ్లు అనేవి 4500 సంవత్సరాల ముందు కట్టినవి. ఈ భారీ పిరమిడ్లు ఒక్క ఈజిప్ట్ లోనే కాదు, ప్రపంచం అంతటా ఉన్నాయి. అమెజాన్ అడవిలో ఉన్నాయి, అట్లాంటిక్ పసిఫిక్ మహా సముద్రాల్లోనూ, చైనా ఎదరులోనూ కూడా పిరమిడ్లు ఉన్నాయి. అయితే అంతటి భారీ పిరమిడ్లు మనకున్న టెక్నాలజీని ఉపయోగించుకుని కూడా మన నిర్మాణం చేయడం లేదు. మరి ఏ టెక్నాలజీ లేని నాగరికత మొదలైన మొదటి రోజుల్లోనే 4500 సంవత్సరాల క్రితమే వాటిని ఎలా కట్టారు?
ఒక పిరమిడ్లో ఉండే రాళ్లలో ఒక్కొక్కటి మూడు టన్నుల బరువు ఉంటుంది!. అలాంటి రాళ్లు ఒక్కో పిరమిడ్ లో 23 లక్షలు ఉన్నాయి. మరి ఆంతటి బరువుని అంత పైకి ఎలా తీసుకు వెళ్ళారు? అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
ఇంకొక ఆశ్చర్యం ఏమిటంటే – ఆయుర్వేదం మనకి పుస్తక రూపం లో దాదాపు 2500 సంవత్సరాల ముందు నుండే ఉంది. కానీ ఆయుర్వేదం ఉనికిలో ఉన్న 1,000 సంవత్సరాల తర్వాత ఉద్భవించిన కొత్త వ్యాధులకు కూడా, ఆయుర్వేదంలో ఇప్పటికే వాటికి మందులు ఉన్నాయి. ఫ్యూచర్ లో రాబోయె రోగాలగురుంచి ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది? మన వేదలో ప్రస్తుతం మనకున్న టెక్నాలజీ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ నీ ఎలా డెవలప్ చేయడంలో రాసి ఉంది.
శంభాలా – వేదాల మూల కేంద్రమా?
అనేకమంది అడిగే ప్రశ్నే ఇదే — “ఇన్ని వేల ఏళ్ల క్రితమే మన వేదాల్లో ఇవన్ని ఎలా రాశారు?” దానికి ఒకే సమాధానం ఉంది: శంభాలా.
శంభాలా అనేది మన కళ్లకి కనిపించే సాధారణ నగరం కాదు. ఇది బహుళ-లోకాలు (multi-dimensional) కలిగిన ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యం. అక్కడ నివసించే వారు శారీరకంగా, మానసికంగా పరిపూర్ణమైన మనుషులు. వారు అతి అందంగా ఉంటారు. వారికి రోగాలు రావు. ఒక్కొక్కరూ నాలుగు వేల సంవత్సరాల వరకు ఆయుష్షుతో జీవిస్తారు.
మన పురాణాల్లో చెప్పిన చిరంజీవులు — హనుమంతుడు, అశ్వత్థాముడు లాంటి వారు — ఇంకా బ్రతికే ఉన్నారు. ఎక్కడంటే, ఇదే శంభాలాలో! ఇది కేవలం ఒక మిధ్యం కాదు, భారత ఋషుల తపస్సులోంచి వెలసిన ఓ పరమ గూఢమైన నిజం.
శంభాలాలో అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఉంది. వాళ్లు టైమ్ ట్రావెల్ చేయగలరు. టెలిపోర్టేషన్ అంటే క్షణాల్లో చోటు మారడం — అది కూడా సాధ్యమే. అంతేకాదు, వారు బయటి లోకాల్లోంచి వచ్చిన ప్రాణులతో (aliens) కూడా సంప్రదింపులు జరపగలరు. వాళ్లకు అసాధ్యమైన పని లేదు. అందుకే, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో వాళ్లకు ముందుగానే తెలుస్తుంది.
అదే కారణంగా మన ఆయుర్వేదం లో భవిష్యత్తులో వచ్చే కొత్త రోగాలకూ మందుల గురించి ముందుగానే రాసి ఉంది. ఎందుకంటే ఈ జ్ఞానం శంభాలాలో నుంచి వచ్చినది. వేదాల మూలం కూడా ఇదే శంభాలా.
ఇక కల్కి అవతారం విషయానికొస్తే — ఆయన సైన్యంలో ఉండే ధీరులకి శిక్షణ ఇచ్చినవాడు ఎవరో తెలుసా? అశ్వత్థాముడు (Ashwathama). మహాభారతంలో చిరంజీవిగా పేర్కొన్న ఈ మహాయోధుడు, ఇప్పటికీ శంభాలాలో ఉంటూ, భవిష్యత్తు యుద్ధానికి వీరులని సిద్ధం చేస్తున్నాడు.
శంభాలా లోకానికి ప్రవేశం: చక్రాల శక్తి
ఇంత అద్భుతమైన శంభాలా సామ్రాజ్యం ఎక్కడ ఉందంటారా? మనం జీవించేది కేవలం మూడు పరిమాణాల (dimensions) లోనే. మనకు కనిపించేది, వినిపించేది, అనుభవించేది అంతా ఈ మూడు పరిమాణాల వరకే. కానీ ఇక్కడే కథ ఆగిపోదు. దీని తరువాత నాలుగవ పరిమాణం ఉంటుంది — అదే కాలం (time) మరియు స్థలం (space). దీన్ని మనం పూర్తిగా అందుకోలేము, అందుకే ఇది మనకి రహస్యమే.
ఈ నాలుగవ పరిమాణం తర్వాత ఇంకొకటి ఉంది — ఐదవ పరిమాణం. దీనినే దైవ పరిమాణం (God Dimension) అంటారు. ఇది అంత సులభంగా అందుబాటులోకి రాదు. మన శరీరంలో ఉండే ఏడు చక్రాలు (chakras) అనేవి శక్తి ప్రసరణకు గేట్లు లాంటివి. అలానే భూమి మీద కూడా కొన్ని ప్రత్యేక శక్తి కేంద్రాలుంటాయి — ఇవి భూమి యొక్క చక్రాలు లాంటివి. ఇవి జీవం ప్రవహించే మార్గాలు.
మన శరీరంలోని ఈ చక్రాలను మనం పూర్తిగా జాగృతం చేయగలిగితే, మనం ఇతర లోకాల్లోకి ప్రయాణించగలుగుతాం. మనం ఒకేసారి రెండు చోట్ల ఉండగలగటం, భూమి చుట్టూ ఒక్క నిమిషంలో తిరిగిరావటం, కాలాన్ని వంచటం — ఇవన్నీ సాధ్యమవుతాయి. అంతే కాదు, మన కలల లోకాల్లోకి కూడా స్పష్టంగా ప్రయాణించగలుగుతాం.
ఈ అవకాశాలన్నింటినీ సాధించాలనే తపనతో అనేకమంది మునులు, సన్యాసులు, సాధువులు, హిమాలయాలను ఆశ్రయిస్తారు. ఎందుకంటే హిమాలయాల్లో ఉన్న శక్తి తరంగాలు (energy frequencies) ఈ ప్రయాణానికి అవసరమైన స్థాయిలో ఉంటాయి.
పైరమిడ్లు (Pyramids) — ఇవి ఈ భూమిపై ఉన్న ఉన్నత శక్తి కేంద్రాలు. ఇవి భూమి చక్రాల దగ్గర ఉండే కేంద్రాలే. పైరమిడ్లో ధ్యానం చేస్తే, మన ఇంట్లో ధ్యానం చేసేదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ శక్తి మనకందుతుంది. హిమాలయాల్లో ధ్యానం చేస్తే అది సాధారణంగా వచ్చే ప్రభావం కంటే 1000 రెట్లు ఎక్కువగా శక్తిని ఇచ్చేలా amplify అవుతుంది. అందుకే చాలా మంది సాధువులు హిమాలయాల్లోనే తపస్సు చేస్తారు.
ఇప్పుడు అసలు విషయం ఎవరైతే తమ చక్రాలను పూర్తిగా యాక్టివేట్ చేసి, శక్తిని సమతుల్యం చేయగలిగితే — వారు ఆ మల్టీ-డైమెన్షనల్ శంభాలా లోకాన్ని చూడగలరు. ఎందుకంటే శంభాలా అనేది భౌతికంగా ఉండే నగరం కాదు. అది ఒక అనుభవం, ఒక తత్వం, ఒక ఎనర్జీ స్థాయి.
అది మన కంటికి కనిపించాలంటే — మన శరీరం, మన ఆత్మ ఒక నిర్దిష్ట శక్తితరంగం (frequency) లోకి రావాలి. ఆ శక్తితరంగం — హిమాలయాల్లో సులభంగా లభిస్తుంది. అందుకే చాలామంది శంభాలా హిమాలయాల్లోనే ఉందని అనుకుంటారు.
శంభాలా శక్తి కోసం హిట్లర్ ప్రయత్నాలు:
శంభాలా అనేది హిమాలయాల్లోనే ఉంటదని చాలామంది అంటారు, కానీ నిజానికి అది మన మనసులోనే ఉంటుంది. మరి, శంభాలా చేరుకోవడానికి ఎవరు ప్రయత్నించలేదా అన్న ప్రశ్న వస్తే, గత 2000 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది దానిని చేరుకోడానికి ప్రయత్నించారంటే ఆశ్చర్యం ఉండదు. ఆ ప్రయత్నాలలోనే ఒకరు హిట్లర్ కూడా ఉన్నారు.
నికోలస్ రోరిచ్ (Nicholas Roerich) అనే ప్రఖ్యాత అన్వేషకుడు 1924 నుండి 1923 వరకు “టిబెటన్ కాలచక్ర మంత్ర” అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని శంభాలాకు చేరుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. అతని ఆ ప్రయత్నానికి ప్రధాన కారణం ‘చింతామణి’ అనే ఒక అద్భుత రాయి కోసం.
చింతామణి అంటే ఆకాశం నుంచి నేలకి పడ్డ రాయి అని చెప్పబడుతుంది. దీని గురించి ఎన్నో మహిమలు చెప్పబడతాయి. ఆ రాయి చేతిలో పడితే మనం ఏది కోరినా, అది క్షణంలో నెరవేరుతుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఈ శక్తివంతమైన చింతామణితో మనం సకల ప్రపంచాన్ని అధిగమించగలమని విశ్వసిస్తారు. ఆ చింతామణి ఒరిజినల్గా శంభాలాలోనే ఉందని చెబుతారు. అక్కడ ఉన్నవారు ఈ రాయిని బుద్ధుడికి కూడా ఇచ్చారు.
హిట్లర్ కూడా శంభాలాలో ఉన్న ఈ గుప్త శక్తులను పొందాలని ఆశించాడు. కానీ చివరికి అతని ఈ ఆశలు నిరాశగా మిగిలిపోయాయి.
శంభాలా అనుభవం: ఎవరు పొందగలరు?
చాలామంది చెప్పారు, “శంభాలా ని చూసి తిరిగి వచ్చాం” అని. అంటే వారు తమ షట్ చక్రాలు (చక్రాలు) యాక్టివేట్ చేసుకుని, శుభ్రమైన మనసుతో మాత్రమే అక్కడి దారి దొరుకుతుందనే అర్థం. ఎవరికైతే శుద్ధి గల హృదయం, ప్రేమతో కూడిన జ్ఞానం ఉంటుందో వారు మాత్రమే శంభాలాను దర్శించగలరు. ఆ అనుభవాన్ని పొందగలరు.
హిమాలయాల్లో శంభాలా రాజ్యానికి చేరడానికి ప్రత్యేకమైన ఎనర్జీ పోర్టల్స్ ఉంటాయి. అందుకే అక్కడ 19వ శతాబ్దంలో కొన్ని సివిలియన్లు, సైనికులు అక్కడ బంగారు లేత వలయాకార వాహనాలు (ఫ్లయింగ్ సౌసర్స్) చూసినట్లు చెప్తారు.శంభాలా మన శారీరక (physical) మరియు ఆధ్యాత్మిక (spiritual) డైమెన్షన్ల మధ్యలో ఉంది.
మన శరీరంలో హృదయం ఎంత ముఖ్యమో, అలాగే మన భూమికి కూడా శంభాలా చాలా ముఖ్యమైన చోటు. మన శరీరంలో కలుషిత రక్తం హృదయానికి వచ్చి ఎలా శుద్ధి అవుతుందో, అలాగే భూమిలోని కాలుష్యాలు శంభాలా నేల క్రిందికి వెళ్లి అక్కడ ఎలా శుభ్రమవుతాయో అటువంటిదే.
శంభాలా మన భూమి పై ఉన్న అత్యంత పవిత్ర ప్రదేశం. శంభాలా గురించి ఇంకా తన ప్రయాణం, అనుభవాలు గురించి ఒకరు పుస్తకంలో కూడా రాశారు.
నిజానికి శంభాలా ఉంది, కానీ అందరు దానికి చేరువ కాలేరు. ఈ విషయం కొత్తగా “కల్కి” సినిమా ద్వారా కొంతమేర చూపిస్తారు.
See also: తిరుమల ఏడు కొండల వెనుక అసలు చరిత్ర మీకు తెలుసా?
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.