Home » అబద్ధాల చిలుక – నీతి కథ

అబద్ధాల చిలుక – నీతి కథ

by Shalini D
0 comment

ఒకప్పుడు అడవిలో మీన అనే చిలుక ఉండేది. అది ఎక్కువగా అబద్దలు చెప్పేది. అడవిలో ఇతర పక్షులు, జంతువుల ముందు అబద్దలతో గొప్పగా చెప్పుకునేది. ఒక రోజు ఒక పక్షి చెట్టు మీద కూర్చొని ఉంది. అది ఆ  పక్షి వద్దకు వెళ్లి “నేను గ్రామంలోని జమిందార్ వద్దకు వెళ్ళాను. అక్కడ చాలా మంచి స్వీట్లు, వంటలు తిన్నాను”, అది అంది. మరియు ఎప్పుడైనా ఇతర అడవి జంతువుల వద్దకు వెళ్లి నేను డేగ కంటే ఎత్తుకు  ఎగరగలనని మరియు నేను చాలా దేశాలకు తిరిగి వచ్చాను, అని చుబుతుంది. 

చిలక చేష్టలు వల్ల, తాను చాలా అబద్దలు చుబుతుందని అడవిలో మొత్తం జంతువులకి అర్ధం అయ్యింది. ఒక రోజు చాలా అందమైన పావురం అడవికి వచ్చింది. పక్షులన్ని దానిని చుడటానికి వచ్చాయి. మీనా చిలుక కూడా పావురాన్ని చూడటానికి  వచ్చింది. చిలుకను చుసిన పావురం మీ పేరు “మీనా” కదా అని అడిగింది. ఇది విన్న చిలుక అవును నేనే మీనా చిలుకను. దీని తరువాత, “ బయట ఉన్న ఇతర జంతువులు కూడా నేను తెలుసు” అని తాను గొప్పలు చెప్పడం ప్రారంభించింది.

నేను చాలా ధనవంతురాలిని, నేను చాలా మంచి ఆహారం తింటాను. న దగ్గర వజ్రాలు, రత్నాలుచాలా ఉన్నాయి. అని అన్ని జంతువుల ముందు గొప్పగా  చెప్పింది. ఇది విన్న పావురం, నేను రాజ సేవకడిని. మంచి విందు కోసం మిమ్మల్ని రాజు ఆస్థానానికి ఆవ్వానించారు. అందుకు నిన్ను తెసుకేళ్లడినికి వచ్చాను. కానీ, మీరు ఇప్పటికే బాగా జీవిస్తున్నారు మరియు మీరు బాగా మంచి ఆహారం తింటాను అంటున్నారు. అయితే నేను వెళ్లాను” అంది. 

చిలుక ఇది విని, “నేను ఇదంతా గొప్పగా చెప్పుకునున్నాను”, అని అంటుంది, దీని తరువాత, పావురం చిలుక మాట వినకుండా వెళ్ళిపోయింది. ఇది చుసిన అడవిలోని పక్షులు, జంతువులన్ని నవ్వడం ప్రారంభించాయి.

నీతి: మనం ఎప్పుడు  అబద్ధాలు చెప్పకూడదు,” ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండాలని, అబద్దాలను దూరంగా ఉంచాలని నేర్చుకోవాలి. నిజాయితీతో జీవించడం మనకు మంచి సంబంధాలు, గౌరవం మరియు సంతృప్తిని అందిస్తుంది. అబద్దాలు చెప్పడం కంటే, నిజాయితీగా ఉండడం ఎప్పుడూ మంచిది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి. 

You may also like

Leave a Comment