Home » కష్టానికి గుర్తింపు – కథ

కష్టానికి గుర్తింపు – కథ

by Haseena SK
0 comment

రంగాపురం అనే ఊళ్లో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు ఎవరే పని చెప్పినా చేసి పెట్టి వాళ్లిచ్చే డబ్బు తీసుకునేవాడు. ఏ పనయినా చాలా శ్రద్ధగా నిజాయతీగా చేస్తాడని. అతడికి పేరు ఓసారి గొపయ్యను ಆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్ను పడవకురుంగులేయమనీ చెప్పాడు. గోపయ్య కుಆ డబ్బు తక్కువని తెలిసినా పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగుల్ని తీసుకుని పడవ దగ్గరకు వెళ్ళాడు.

అయితే రంగులు వేసేందుకు పడవలోకి ఎక్కితే దాని మధ్యలో ఓ రంధ్రం కనిపించింది. దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు సాయంత్రానికి పని పూర్తి అయింది. జమీందారు మర్నాడు కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరవతలకు వెళ్లారు అదే రోజు ఊరి నుంచి తిరిగొచ్చిన జమీందారు నౌకరుకి. ఈ విషయం తెలిసి కంగారుపడుతూ అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే కాసేపటికి కుటుంబ సభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపించింది.

వాళ్లు ಒడ్డుకు చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు. విషయం అర్థమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిచి చెప్పిన దాని కన్నా ఎక్కువ డబ్బు ఇస్తూ రంగులేయని చెబితే రంధ్రాన్ని కూడా పూడ్చావు  నీ మేలు మర్చిపోలేను నీవల్లే  ఈ రోజున నా ఇంట్లో వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. అని ప్రశంసించాడు. అలా గోపయ్య మంచితనం ఊళ్లో వాళ్ళంతా మరోసారి తెలుసుకుని అతడిని అభినందించారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment