Moral Story of Nakkasuri Panchatantra

నక్కసూరి కథ – పంచతంత్రం 2.0

by Manasa Kundurthi

ఒక ఊరిదగ్గర చక్కటి అడవి ఉండేది. ఆ అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి. కానీ ఆ అడవిలో ఒక మాయ నక్క ఉండేది. పేరు నక్కసూరి. ఈ నక్కకి ఓ ప్రత్యేకత – మాటలతో మాయ చేసి ఇతర జంతువుల్ని మోసం చేయడమే పని.

ఒకరోజు ఒక చిలుక చెట్టు మీద కూర్చుని “స్వీట్ స్వీట్!” అంటూ పాట పాడుకుంటూ చెరుకు తింటుంది. నక్కసూరి తినే తిండి కనిపించక అలమటిస్తోంది అప్పుడే చిలక దెగ్గరున్న చెరుకును చూసింది. 

అప్పుడు నక్కసూరి మాయ మాటలతో – 

“ఓ చిలుకమ్మా! నీ పాటలు రామయ్య గానాల్లా వుంటాయి. నీ గొంతు వింటుంటే నాకు మధురమైన పంచామృతం తాగినట్టు అనిపిస్తుంది!” అని పొగిడింది.

చిలుక దానికొక చెరకు తీపి పుల్ల కింద వేసింది. నక్కసూరి దాన్ని తీసుకుని తింటూ,

“ఇలాంటి పాటలకి బహుమతి ఇవ్వకపోతే అన్యాయం అవుతుంది కదా?” అంది. ఈ మాటలు చిలుకను మోసం చేయడానికి నక్క చేసిన మాయ. 

మరో రోజు ఒక కోడి తన పిల్లలతో కలసి గూడు దగ్గర తినే ఆహారం వెతుకుతోంది. నక్కసూరి వచ్చి అంది:

“బంగారు కోడి, నీ పిల్లలు ఎంతో చాకచక్యంగా వున్నారు. వాళ్లకి నేను కాసేపు పాఠాలు చెబుతాను. అప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకో!”

కోడికి నమ్మకం వచ్చి పిల్లల్ని నక్క చేతిలో పెట్టేసింది. కానీ నక్క మాయ మాటలతో పిల్లల్ని తీసుకెళ్లింది. కోడి ఏడుస్తూ అడవిలోకి పరుగెత్తింది.

ఇవన్నీ చూసిన అడవి జంతువులు సమావేశమయ్యాయి. అప్పుడు ఓ తెలివైన ఎలుక ముందుకొచ్చింది. అది కంప్యూటర్ కీబోర్డు మీద తపతపలాడుతూ నక్కసూరి చేసిన మోసాలన్నీ ఓ ఫైలుగా తయారు చేసి, అడవి పంచాయతీలో చూపించింది.

పెద్ద జింక, బల్లి, ఎలుగుబంటి కలిసి తీర్పు చెప్పాయి:

“నక్కసూరీ! నీ మాయలు ఎన్నాళ్లూ సాగవు. నువ్వు ఇతరులపై మోసం చేస్తూ తిరుగుతున్నావు. నీకిది చివరి అవకాశం. మారు – లేకుంటే అడవిలోంచి పంపించేస్తాం.”

నక్కసూరికి సిగ్గేసింది. నిస్సహాయంగా తలవంచింది. ఆ రోజు నుంచి నక్క తన తప్పుల్ని గుర్తించుకొని నిజాయితీగా బ్రతకాలని నిర్ణయించుకుంది.

నెపత్యంలో సూక్తి:

“తెలివి మాయకు కాదు – సహృదయతకు వినియోగించాలి.”

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలు ను చూడండి.

You may also like