Home » ఇలాంటి తప్పులు చేస్తున్నార.. అయితే కచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కోల్పోతారు.. ఎంత సంపాదించినా నిలవదు!

ఇలాంటి తప్పులు చేస్తున్నార.. అయితే కచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కోల్పోతారు.. ఎంత సంపాదించినా నిలవదు!

by Vinod G
0 comments
making these mistakes will lose money

మన నిత్యజీవితంలో తెలిసో తెలియకనే చేసే చిన్న చిన్న తప్పుల వల్ల లక్ష్మీ దేవి కటాక్షం మనకు లభించదు. ఈ చిన్న చిన్న తప్పులు గురించి హిందూ పురాణాలలో స్పష్టంగా వివరించబడింది. కానీ మనం వాటిని పాటించకుండా, అనవసరంగా చేసే ఈ తప్పుల వలన మనం లక్ష్మీ దేవిని దూరం చేసుకుంటూ, ఆర్థిక సమస్యలతో బాధపడుతుటాం. ఇప్పుడు మనం చేసే అలాంటి ముఖ్యమైన తప్పులేమిటో తెలుసుకుందాం… జీవనశైలిని మెరుగుపరచుకుందాం… మరియు లక్ష్మి అనుగ్రహాన్ని పొందే మార్గంలో ముందుకు సాగుదాం. 

శుక్రవారపు పొద్దు సిరిని విడవ వద్దు

శుక్రవారం రోజున డబ్బు మన నుండి బయటకు వెళ్లకూడదు అన్నది హిందూ సంప్రదాయంలోని గొప్ప నమ్మకం. ఇది కేవలం ధనం కోణంలో కాకుండా ఆధ్యాత్మిక భావనతో కూడిన విషయం. మన హిందూ సిద్ధాంతాలలో ‘డబ్బు’ను కరెన్సీగా కాకుండా, లక్ష్మీ దేవి రూపంగా భావిస్తారు. అదేవిధంగా, మన ఇంటి ఆడపడుచును కూడా లక్ష్మీ స్వరూపంగా పరిగణిస్తాం. కాబట్టి శుక్రవారం నాడు మన ఇంటి నుండి లక్ష్మీదేవిని బయటకు పంపకూడదు – అది ధన రూపంలో అయినా, మహిళ రూపంలో అయినా. ఈ నమ్మకానికి వెనుక ఉన్న సందేశం ఏమిటంటే, ధనం నిలవాలంటే ఆ దినాన్ని పవిత్రంగా, లక్ష్మి నిలిచేలా కొనసాగించాలనే భావన.

దీపాన్ని ఆర్పవద్దు

దీపాన్ని నోటితో ఊపవద్దు. అంటే వెలుగుతున్న దీపాన్ని నోటితో గాలి ఊది ఆర్పకూడదు. ఇది మనం నిత్యం తెలియక చేసే ఒక సాధారణ తప్పు. ముఖ్యంగా పుట్టినరోజుల సమయంలో దీపాన్ని నోటితో ఊది ఆర్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ దీన్ని మన హిందూ సంస్కృతి దృష్టిలో చూస్తే ఇది పూర్తిగా తగదు.

అగ్ని మన పురాణాల్లో ఒక దేవతా స్వరూపంగా కొలవబడతాడు. అలాంటి వెలుగును మనం మరొకరికి పంచాలి కానీ ఆర్పివేయకూడదు. పుట్టినరోజు రోజు దీపం ఆర్పడమేంటి దరిద్ర సంకేతం కాకపోతేనూ, దీపం అవసరం లేకపోతే చేతితో గాలి విసిరి ఆర్పవచ్చు – కానీ నోటితో కాదు. ఎందుకంటే నోటిలో నుండి వచ్చే గాలి అపవిత్రతను కలిగించవచ్చు అని మన ఋషులు చెబుతారు.

అందువల్ల దీపాన్ని ఆర్పేటప్పుడు కూడా మనం ఒక గౌరవం, శ్రద్ధ కలిగి ఉండాలి. దీపం వెలిగించినా, ఆర్పినా అది సాంస్కృతికంగా పవిత్రమైన కార్యం. మనం దీన్ని గౌరవంగా చూసినప్పుడే నిజమైన వెలుగు మన జీవితాల్లో ఉంటుంది.

బువ్వ నెట్టొద్దు

“బువ్వ నెట్టొద్దు” అని పెద్దలు ఎందుకు అంటారో తెలుసా? అంటే, తినే అన్నాన్ని అగౌరవంగా తోసివేయకూడదని, దూరం చేయకూడదని అర్థం. కానీ మనం కుటుంబంలో గొడవల వల్ల కోపంలో పళ్లెం విసిరి వేయడం, తినకుండా లేచి వెళ్లిపోవడం, లేదా ఇతరుల మీద కోపంతో తినే ఆహారాన్ని తిరస్కరించడం వంటి చర్యలు తరచూ జరుగుతుంటాయి. ఇవన్నీ మన సంప్రదాయ పరంగా, ఆధ్యాత్మిక దృష్టికోణంలో, చాలా పెద్ద తప్పులు.

మన హిందూ ధర్మంలో తినే అన్నాన్ని ‘పరబ్రహ్మ స్వరూపం’గా భావిస్తారు. అది కేవలం ఆహారం కాదు  దేవుని ప్రసాదం. అలాంటి అన్నాన్ని తినడానికి బ్రతిమిలాడిచ్చుకోవడం, కోపంగా తోసేయడం లేదా గౌరవం లేకుండా విడిచిపెట్టడం వంటివి చేయకూడదు. మీ కోపం ఏమైనా ఉండొచ్చు, కానీ ఆహారాన్ని అవమానపరచకూడదు.

భూమిపై కోట్లాది మంది ఒక్క పూట అన్నం కోసమే అలలాడుతున్నారు. అలాగే చాల మంది కోట్లకు పడిగెత్తి ఆస్థి ఉన్నా తినే యోగం లేక అల్లాడుతున్నారు . అలాంటి సమాజంలో మనకు తినే అవకాశం దక్కడం భగవంతుని అనుగ్రహం అనే దృష్టితో చూడాలి. ఆ విందును గౌరవించాలి. భోజనం అంటే కేవలం కడుపు నింపే సాధనం కాదు  అది కృతజ్ఞతతో స్వీకరించాల్సిన వరంగా భావించాలి.

ఇంటి ఆడపడుచు మనసు కష్టపెట్టొద్దు

ఇంటి ఆడపిల్లను పెళ్లి చేసి పంపించాం అంటే ఆమె బాధ్యత అక్కడితో ముగిసిందని అనుకోవడం ఎంతో పెద్ద తప్పు. తల్లిదండ్రులు లేకపోయిన తరువాత, సోదరులు ఆడపడుచును పట్టించుకోకపోవడం, ఆమెకు పుట్టినిల్లు ఉండకపోవడం చాలా బాధాకరం. ఇది కేవలం కుటుంబ బాధ్యత కాదు, ఇది ఒక మానవతా విలువ.

ఆడపిల్లకు ఆమె పుట్టినింటి జ్ఞాపకాలే శరణ్యం. అలాంటి చోట ఆమెను తిరస్కరించడం అంటే లక్ష్మీదేవిని ఇంట్లోనుంచి తోసివేసినట్టే. ఆమెను గౌరవంగా ఆహ్వానించి, మర్యాదగా పలకరించి, ఆనందంగా పంపిన ప్రతి సోదరుడు, కుటుంబం నిజమైన లక్ష్మీ కటాక్షాన్ని పొందుతుంది. మీరు పెట్టిన పది రూపాయలు, లక్ష్మి అనుగ్రహంతో వెయ్యిగా మారతాయి.

కానీ ఆడపడుచును ఇంటికొచ్చే పరిస్థితి వచ్చినప్పుడు, ‘ఎందుకు వచ్చింది?’ అనే ప్రశ్నలు వేస్తూ, బాధ పెడితే ఆమెకు పుట్టినిల్లు లేకుండా చేస్తే అటువంటి ఇంటికి సుఖసంతోషాలు దూరం కావడం ఖాయం. ఇది నమ్మకం కాదు, ఇలాంటి ఎన్నో  అనుభవాలను గమనించవచ్చు.

సంధ్య, మలిసంధ్య వేళల్లో నిదురపోవద్దు

ఉదయం సూర్యోదయం తర్వాత, అలాగే సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో నిద్రించకూడదు. ఇది మన పురాణ సంప్రదాయాల ప్రకారం చాలా ముఖ్యమైన జీవన నియమం. కానీ ప్రస్తుత సమాజం రాత్రింబవళ్ళు పార్టీలు, పబ్బులు, మానసిక అలసటల మధ్య జీవితం కొనసాగీస్తూ, అర్ధరాత్రి నిద్రపోతూ, ఉదయాన్నే నిద్రలేవకుండా, మధ్యాహ్నం వరకు నిద్రపోయే అలవాట్లు పెరుగుతున్నాయి.

అలాగే సాయంత్రం చిరుతిళ్లు తిని, అలసటతో నిద్రపోయి, రాత్రివేళ మళ్ళీ మేలుకోవడం,  ఇవన్నీ ధర్మబద్ధమైన జీవన విధానానికి విరుద్ధంగా ఉంటాయి. పురాణాల ప్రకారం, ఈ సమయాల్లో నిద్రించడం వల్ల లక్ష్మి కటాక్షానికి బదులు దరిద్రం మనల్ని వెంటాడుతుంది.

ఉదయం సూర్యోదయానికి ముందే లేచి, సూర్యభగవానుడికి నమస్కారం చేయడం, సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో మేలుకొని, భగవంతుని ధ్యానించడంలాంటి శుభకార్యాలు చేయడం వలన మనం లక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందగలము.

ఇంటి ఇల్లాలితో కంటతడి పెట్టనీయవద్దు

అంటే భార్యచేత కంటతడి పెట్టనీయొద్దని అర్ధం. భార్య మనసు నొప్పించకుండా, ప్రేమగా చూసుకోవడం అని అర్ధం. అంతే కానీ మనఇష్టునుసారం చేసేసి ఏడవద్దు అంటే కాదు. ఆమెకు తగిన గౌరవం ఇచ్చి బాధ్యతగా చేసుకోవాలి. ఒక పర స్త్రీ ముక్కు మొకం తెలియని నిన్ను భర్తగా అంగీకరించి నిన్ను నమ్మి వచ్చిన తనను గౌరవించడం ఆ భర్త భాద్యత.

అంటే, భార్య కళ్ళ వెంట కన్నీళ్లు కారనివ్వకూడదు అన్నమాట. అంటే దానర్ధం ఆమెను కొట్టే లేదా బయపెట్టో ఏడవనీకుండా వుంచడం కాదు, ఆమె మనసును గాయపరచకుండా, గౌరవంతో, ప్రేమతో చూసుకోవాలి. ఈ జీవన మార్గం ఆధ్యాత్మికంగా మంచిదే కాదు, సామాజికంగా కూడా అత్యవసరం.

ఒక పర స్త్రీ ముక్కు మొకం తెలియని నిన్ను భర్తగా అంగీకరించి నిన్ను నమ్మి వచ్చి తన జీవితాన్ని తన ఆశల్ని నీ మీదే పెట్టుకుంటుంది.

అలాంటి ఆమెను చిన్నచూపు చూడడం మంచి విషయం కాదు, ఆమెను గౌరవించడం, రక్షించడం, ప్రేమించడం భర్తగా నీ నిజమైన బాధ్యత.

ఇంటి కంటతడి పెట్టుకుంటూ బాధపడుతుంటే ఆ ఇంట్లో శాంతి ఉండదు, లక్ష్మి నిలబడదు. ఇంటి ఇల్లాలి ఆనందమే ఆ ఇంటి వెలుగు.

కల్లలాడని ఇంట గోమాత వెంట

అంటే అబద్ధాలు మాట్లాడని ఇంట్లో, గోమాతకు సేవ చేసే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది అని మన పురాణాలు చెబుతున్నాయి.

అబద్ధాలు అనేవి చిన్నవైనా, పెద్దవైనా మన ఇంటి శుభతకు, ధార్మికతకు భంగం కలిగిస్తాయి. సత్యం మాట్లాడటం వల్ల కొద్దిగా తాత్కాలికంగా ఇబ్బంది అయినా, దీర్ఘకాలంలో ఆ ఇంటి పై దేవతా కటాక్షం ఉంటుంది.

గోమాత అన్నాక, ఇంట్లో ఉండకపోయినా పరవాలేదు. మీ ఇంటి దగ్గర ఉన్న గోశాలలకు, ఆలయాలలో గోవులకు, మీరు చేసే సేవే వేల సహాయం. అది ధానం, ఆహారం, గడ్డి లేదా ఏ సేవ రూపంలో అయినా సరే అది లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది.

ముంగిళ్ల ముగ్గుల్లో పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో ధాన్యరాశుల్లో మాతల్లి వరలక్ష్మి స్థిరముగా నుండు

అంటే, మనం ముంగిట వేసే ముగ్గుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటారని అర్థం. కాబట్టి ప్రతిరోజూ ఇంటి ముందు శుభ్రమైన ముగ్గు వేయడం ఎంతో మంగళకరం. అలాగే, పసుపు పూసిన గడప కూడా లక్ష్మీదేవి నివాసానికి సంకేతంగా భావించబడుతుంది.అంతేకాక, పూలలో, పాలలో, ధాన్యరాశుల్లో లక్ష్మీదేవి శుభసన్నిధి ఎల్లప్పుడూ ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కేవలం వస్తువులుగా కాకుండా, ఆధ్యాత్మికతతో కూడిన శుభపరిశుద్ధతగా భావించి, వాటికి తగిన గౌరవం, మర్యాదలు చూపించడం మన బాధ్యత.


👉ఇంకా ఇటువంటి వాటి కోసం తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.