Home » కష్టానికి చేత గుర్తింపు – కథ

కష్టానికి చేత గుర్తింపు – కథ

by Haseena SK
0 comment

రంగాపురం అనే ఊళ్లో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు ఎవరే పని చెప్పినా చేసి పెట్టి వాళ్లిచ్చే డబ్బు తీసుకునేవాడు ఏ పనయినా చాలా శ్రద్ధంగా నిజాయతీగా చేస్తాడని అతనికి పేరు ఓ సారి గోపయ్య ను ఆ ఊరి జమీందారి పిలిచి తన దగ్గురన్న పడవకు రంగు లేయమనీ అందుకు యాభై రూపాయలు ఇస్తాననీ చెప్పాడు. గోపయ్యకు ఆ డబ్బు తక్కువని తెలిసినా పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగుల్ని తీసుకుని పడవలోకి ఎక్కితే దాని మధ్యలో ఓ రంద్రం కనిపించింది. దాన్ని పూడ్చకుండా రంగు లేయడం వల్ల ఉపయోగం లేదునుకున్న గోపయ్య ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు సాయంత్రానికి పని పూర్తి అయింది. జమీందారు మార్నాడు. వస్తే డబ్బులిస్తానని చెప్పి గోపయ్యను పంపించేశాడు మార్నాడు జమీందారు కుటుంబసభ్యులంతా  ಆ పడవ ఎక్కి ఊరవతలకు వెళ్లారు. అదే రోజు ఊరి నుంచి తిరిగొచ్చిన జమీందారు దగ్గరకు వెళ్లి ఆ పడవకు ఉన్న రంధ్రం గురించి చెప్పాడు దాంతో జమీందారు కంగారుతో అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే కాసేపటికి కుంటుబ సభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపించింది. వాళ్లు ఒడ్డుకు చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు. విషయం అర్థమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిచి చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బు ఇస్తూ రంగులేయమని చెబితే రంధ్రాన్ని పూడ్చావు నీ మేలు మర్చిపోలేను నీవల్లే ఈ రోజున నా ఇంట్లో వాళ్ల ప్రాణాలతో మరోసారి తెలుసుకుని అతడిని అభినందించారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment