Home » హైదరాబాద్ లో పిల్లలు, పెద్దవాళ్ళు చూసి ఆనందించే 10 ప్రదేశాలను చుడండి!

హైదరాబాద్ లో పిల్లలు, పెద్దవాళ్ళు చూసి ఆనందించే 10 ప్రదేశాలను చుడండి!

by Lakshmi Guradasi
0 comment

రాజధాని ఐన హైదరాబాద్ కు అందరికి వెళ్లాలని ఉంటుంది. పల్లె ప్రాతంలో నివసించే వారు ఒక్కసారైనా వెళ్లి హైదేరాబద్ లో ఉన్న అందాలను చూడాలనుకుంటారు. తెలుగు ప్రజలకు ఉద్యోగ రీత్య, కోచింగ్ రీత్య, పని రీత్య మొదట గుర్తుకొచ్చేది హైదరాబాదే!. హైదరాబాద్ పెద్ద నగరం కాబ్బటి అక్కడ చుట్టుపక్కల ఎలాంటి ప్లేస్ లు ఉన్నాయో చాల మందికి తెలీదు. ఒక వేళా తెలిసిన కొన్ని తెలిసి ఉంటాయి. అందుకోసం మీకు సహపడడానికి క్రింది ఉన్న ప్రదేశాలను చూడంది.

1. చార్మినార్ (Charminar)

Places to visit Hyderabad

చార్మినార్ ని హైదరాబాద్ లో ప్రజలు రోజు చూస్తూనే ఉంటారు. పల్లె ప్రజలకు చిన్నపుడు పుస్తకాలలో చదువుకున్న నాలుగు స్థంబాల కట్టడం, కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ కట్టించాడు అనే విషయాలు మాత్రమే తెలిసుంటాయి.

పూర్తి వివరణ ఏమిటంటే చార్మినార్ (Charminar) హైదరాబాద్ నగరానికి చిహ్నంగా నిలిచిన ఒక కట్టడం. దీన్ని 1591లో మొహమ్మద్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన సుల్తాన్, మొఘల్ సుల్తానేట్ వారసుడు, ప్లేగు వ్యాధి బారిన పడినప్పుడు ఇక్కడే అల్లాని ప్రదించగా అయన వారసుడు కోల్కోవడంతో గుర్తుగా ఈ చార్మినార్ నీ నిర్మించాడు. ఇది 4 మినార్లతో నాలుగు దిశల వైపుగా నిర్మించారు.చార్మినార్ లోపల మొత్తం 147 మెట్లు ఉంటాయి. అక్కడ గోడల మీద ఉన్న చిత్రాలు చాల అందంగా కనిపిస్తాయి. ఈ చార్మినార్ మొత్తం 56 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే ప్రతి మినార్ 48.7 మీటర్ల ఎత్తులో ఉంది. ఇందులో పెద్ద ప్రార్థనా మందిరం మరియు స్త్రీలు ప్రార్థన చేయడానికి ప్రత్యేక స్థలంకూడా ఉంది. 

చార్మినార్ చుట్టుపక్కల లాడ్ బజార్ అనే పిలువబడే సందడిగా ఉండే మార్కెట్ ప్లేస్ ఉంది, అక్కడ మీరు నగల నుండి దుస్తులు, సావనీర్‌ల వరకు ప్రతిదీ కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్ అనగానే మొదట గుర్తొచ్చేది చార్మినార్. హైదరాబాద్ కి వెళ్ళినవారు తప్పకుండ ఈ ప్రదేశానికి వెళ్లకుండా అసలు ఉండరు. చిన్న నుండి పెద్ద వరకు చూసే స్థలం. చుట్టూ నాలుగు మినర్లు గడియరాములతో కనిపిస్తాయి. 

2. గోల్కొండ కోట (Golconda Fort)

Places to visit Hyderabad

ఈ ప్రదేశాన్ని ఎక్కువుగా చాల సినిమాలలో ఉంటాం. చప్పట్లు కొడితే బయటికి వినిపిస్తాయని చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ళ వరకు తమ సంతోషాన్ని చప్పట్ల రూపంలో వ్యక్తం చేస్తూ ఆనందిస్తుంటారు.

గోల్కొండ కోట (Golconda Fort) గురించి వివరణ, హైదరాబాద్ నగరంలో ఒక ప్రసిద్ధ చారిత్రక కోట, దీనికి భారతదేశం చరిత్రలో ప్రముఖ స్థానం కలిగింది. ఇది ఒకప్పుడు కాకతీయుల నుండి కుతుబ్ షాహీ సుల్తానుల వరకు మహానాయకుల పాలనా కేంద్రం. గోల్కొండ కోట తూర్పు దేశాల విలువైన వజ్రాలకు ప్రసిద్ధి, ముఖ్యంగా కోహినూర్, హోప్ డైమండ్, డారియా-ఇ-నూర్ వజ్రాలు గోల్కొండ ప్రాంతం నుండి దొరికినవి అని నమ్ముతారు. కోట దాదాపు 7 కిలోమీటర్ల పొడవైన బలమైన ప్రహరీలతో, 8 సింహా ద్వారాలు వంటి అందమైన రక్షణ నిర్మాణాలతో ప్రత్యేకంగా ఉంటుంది. గోల్కొండ కోటలోని ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఇకో సిస్టమ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. కోట ప్రవేశం వద్ద చప్పట్లు కొడితే, అతికొద్ది దూరంలో ఉన్న “బాలా హిస్సార్ ప్యాలెస్” వరకు శబ్దం వినిపించగలదు. ఇది ఆ కాలంలో రక్షణ చర్యల కోసం ఉపయోగించేవారు.

ఈ కోటలో హిందూ దేవాలయాలు మరియు ఇస్లామిక్ మసీదులు ఉన్నాయి. వీటిలోని శిల్పకళ విభిన్న రూపాలను కలిగి ఉంటాయి. కోటలోని జగదాంబిక ఆలయం ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందవచ్చు.

కోట సాయంత్రం వేళల్లో ప్రకాశవంతంగా ఉంటుంది, ఇది అద్భుతమైన దృశ్యం. తప్పకుండా చూడవల్సిన ప్రదేశం. ముఖ్యంగా ఆ చప్పట్లు సౌండ్ చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అక్కడ కూర్చుని టైం పాస్ చేయొచ్చు. 

3. సాలార్ జంగ్ మ్యూజియం (Salar Jung Museum)

Places to visit Hyderabad
Places to visit Hyderabad

మ్యూజియం అంటే వస్తువుల సేకరణ, ఆ వస్తువులలో శిల్పాలు, పుస్తకాలు, ఖడ్గాలు, పాత కాలపు పరికరాలను పొందుపరుస్తారు. దానినే మ్యూజియం అంటారు. అలాంటి వస్తువులను చూస్తుంటే ఆనాటి నాగరికత ఉత్తుపడేలా అనిపిస్తాయి. వాటిలో అంత అర్ధం దగుంటుంది మరి. ఆలా అర్ధం చేసుకునే శక్తీ ఉండడం కూడా ఒక కళ.

ఈ సాలార్ జంగ్ మ్యూజియం (Salar Jung Museum) మ్యూజియం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగతంగా సేకరించిన కళాఖండాల మ్యూజియాల్లో ఒకటి. ఈ మ్యూజియాన్ని 1951లో సాలార్ జంగ్ III అని కూడా పిలవబడే నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ స్థాపించారు. ఇక్కడ పలు దేశాల నుండి సేకరించిన విలువైన కళాఖండాలు ఉన్నాయి. సాలార్ జంగ్ III యొక్క మరణం తర్వాత, ఈ మ్యూజియం నీ భారత ప్రభుత్వం ప్రజల కోసం అందుబాటులో ఉంచింది.

మ్యూజియంలో పెయింటింగ్‌లు, శిల్పాలు, సిరామిక్‌లు, మాన్యుస్క్రిప్ట్‌లు మరియు మరిన్నింటితో సహా 43,000 వస్తువుల అద్భుతమైన సేకరణ ఉంది. మ్యూజియంలో 38 గ్యాలరీలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి యూరోపియన్, ఆసియా మరియు భారతీయ కళలతో సహా సేకరణను ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా, ఆరోనోఫానా క్లాక్ (The Musical Clock), వీణస్ చతుర్భుజ రూపం మరియు ఆక్సిడెంట్ మరియు ఒరియంట్ కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణలు. ఆరోనోఫానా క్లాక్  ప్రతి గంటకు మ్యూజిక్ వినిపిస్తుంది, ఒక చిన్న వ్యక్తి బయటకు వచ్చి గంటలు కొడతాడు.

ఈ మ్యూజియం మొత్తం సేకరణ సాలార్ జంగ్ III తన జీవిత కాలంలో సేకరించాడు. ఈయన మంత్రిగా కూడా పని చేసాడు. ఇంత గొప్ప సేకరణ ఇంకా ఎక్కడ చూడలేము. 50,000 పుస్తకాలు ఉన్నాయి. వివిధ రాజా వంశీయులకు సంబందించిన ఖడ్గములు ఉన్నాయి. జాడే ఆభరణాలకు సంబదించిన కలెక్షన్లు ఉంది. ఇలా ఒకటి కాదు చెప్పలేనన్ని వాటిని మీరు అక్కడ చూడవచ్చు. 

సందర్శకుల సమాచారం: మ్యూజియం శుక్రవారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. టిక్కెట్లను ఆన్‌లైన్‌లో లేదా మ్యూజియం ప్రవేశద్వారం వద్ద కొనుగోలు చేయవచ్చు. 

4. హుస్సేన్ సాగర్ (Hussain Sagar)

Places to visit Hyderabad

హుస్సేన్ సాగర్ అనేగానే ముందుగా గుర్తుకు వచ్చేది న్యూస్ లో చూపించే హైదరాబాద్ వినాయకుని నిమర్జనాలు. తరువాత బుద్దుడి విగ్రహం, ట్యాంక్ బండ్.

అయితే హుస్సేన్ సాగర్ (Hussain Sagar) సరస్సు హైదరాబాద్‌లోని ప్రసిద్ధి చెందిన నిర్మిత సరస్సు. ఇది 1562లో ఇబ్రహీం కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా, హుస్సేన్ షా వాలి అనే ఇంజినీరును ఉపయోగించి నిర్మించారు. అందుకే ఈ సరస్సు కు హుస్సేన్ సాగర్ అనే పేరు వచ్చింది.  మొదట్లో నీటి సరఫరా కోసం ఈ సరస్సు నీ ఉపయోగించేవారు. ఇప్పుడు పర్యాటక ప్రదేశం గా మారింది. ఈ సరస్సు నీ మూసీ నదిపై కట్టరు. సరస్సు గుండె ఆకారంలో ఉంది, 10 కిమీ (6.2 మైళ్లు) పొడవు మరియు 1.6 కిమీ (1 మైలు) వెడల్పుతో విస్తరించి ఉంది. 

హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో 18 మీటర్ల ఎత్తుతో నిలబెట్టిన పెద్ద బుద్ధ విగ్రహం 450 టన్నుల బరువున్న తెల్లటి గ్రానైట్ రాతితో చెక్కారు. దీనిని 40 మంది శిల్పులు రెండేళ్లపాటు చెక్కారు. ఈ సరస్సు ముఖ్య ఆకర్షణ ఇది. ఈ విగ్రహన్నీ 1992లో ఏర్పాటు ప్రతిష్టించారు. 

హుస్సేన్ సాగర్‌లో బోటింగ్, స్పీడ్ బోట్ రైడ్, మరియు ఇతర వాటర్ స్పోర్ట్స్‌లను చేయవచ్చు. సరస్సుకు చుట్టూ ఉన్న టాంక్ బండ్ ఒక రహదారి, ఇది సాయంత్రం సమయాలలో  ప్రయాణికులతో, సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో వివిధ గొప్ప వ్యక్తుల విగ్రహాలు ఉండటం ఒక ప్రత్యేకత. 

సరస్సు చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్, ఇది రాత్రిపూట లైట్లతో ప్రకాశిస్తుంది. ఈ ప్రాంతంలో ఫుడ్ జాయింట్లు మరియు రెస్టారెంట్లు కూడా ఉండటం వలన ఇక్కడ రాత్రిపూట చాలా సందడిగా ఉంటుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ప్రకృతి, సాయంత్ర సమయాలలో సేద తీరడానికి చాలా మంచి స్థలం. ఇది కుటుంబంతో కలిసి సేదతీరడానికి మంచి ప్రదేశం.

5. బిర్లా మందిరం (Birla Mandir)

Places to visit Hyderabad

హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళు ఈ దేవాలయాన్ని చూడకుంటే చాల మిస్ అయ్యినంటే. ఎందుకంటే ఇక్కడ దొరికే ప్రశాంతతా వేరే దేవాలయాలలో దొరకదు. 

బిర్లా మందిరం (Birla Mandir) హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం, ప్రధాన ఆలయంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని పోలి ఉంటుంది. ఈ మందిరం బిర్లా ఫౌండేషన్ ద్వారా నిర్మించబడింది, భారతదేశంలో వివిధ నగరాల్లో బిర్లా కుటుంబం నిర్మించిన అనేక మందిరాల్లో ఇది ఒకటి. బిర్లా కుటుంబం మద్దతుతో రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి రంగనాథానంద 1976లో ఈ ఆలయాన్ని నిర్మించారు.

బిర్లా మందిరం తెల్లని రాజస్థానీ మార్బుల్ రాతితో (మార్బుల్ స్టోన్) నిర్మించారు. దీని నిర్మాణం సుమారు 10 సంవత్సరాల కాలం పట్టింది. మందిరం నౌబత్ పహాడ్ అనే చిన్న కొండపై నిర్మించారు, ఇక్కడి నుండి హైదరాబాద్ నగరం మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది.

ఇందులో రామాయణం, మహాభారతం, గీతా వంటి పురాణాల్లోని ప్రస్తావనలు, శ్లోకాలు, మరియు కథలు కుడివైపున రాతిలో చెక్కబడి ఉంటాయి. ఆలయ సముదాయంలో గణేశుడు, శివుడు మరియు దుర్గాదేవితో సహా ఇతర హిందూ దేవతలకు అంకితం చేయబడిన మందిరాలు కూడా ఉన్నాయి. 

ఈ మందిరం అందించే ప్రశాంతత మరియు నిశ్శబ్ద వాతావరణం పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం కొండపై ఉంది కాబట్టి, నగరం మరియు హుస్సేన్ సాగర్ సరస్సు యొక్క దృశ్యాలు చాల అందగా కనిపిస్తాయి.

6. రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)

Places to visit Hyderabad
Places to visit Hyderabad

మన తెలుగు సినీ పరిశ్రమ నటులకు రామోజీ రావు ఫిల్మ్ సిటీ మొదటి మెట్టు లాంటిది. ఎవరైనా నటులు కావాలన్నా, తమ టాలెంట్ తో మెప్పించాలన్న ఇక్కడి నుంచే కష్టపడి తెర మీదకు వచ్చే ప్రయత్నాలు చేస్తారు.

ఈ రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City) హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఒకటి, ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా నిర్మాణ కాంప్లెక్స్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. ఈ ఫిల్మ్ సిటీని 1996 లో రామోజీ గ్రూప్ వ్యవస్థాపకుడు రామోజీ రావు స్థాపించారు. ఇది 2000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, మరియు సినిమాల చిత్రీకరణతో పాటు, పర్యాటకుల కోసం ప్రత్యేక ఆకర్షణలతో నిలుస్తుంది. అమితాబ్ బచ్చన్ గార్డెన్స్, జపనీస్ గార్డెన్స్, మరియు ముగల్ గార్డెన్స్ వంటి వివిధ థీమ్ గార్డెన్స్ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తాయి.

రామోజీ ఫిల్మ్ సిటీలో పర్యాటకులు సాహస క్రీడలు కూడా ఆస్వాదించవచ్చు. జిప్ లైనింగ్, బంజీ జంపింగ్, రాక్ క్లైంబింగ్, మరియు ఆర్చరీ వంటి వినోదక్రీడలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. 

రామోజీ ఫిల్మ్ సిటీలో అనేక ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి, ముఖ్యంగా రామోజీ ఫెస్ట్ సమయంలో. పండుగ సీజన్లో ఈ ప్రదేశం ఇంకా ఎక్కువగా అలంకరించబడుతుంది, మరియు స్పెషల్ షోలు, వేడుకలు ఉంటాయి.

రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఫిల్మ్ సిటీల్లో ఒకటి. ఇది సినిమాలపై ఆసక్తి ఉన్న వారికీ, వినోదాన్ని ప్రేమించే పర్యాటకులకు ఒక అద్భుతమైన ప్రదేశం, ఇది కుటుంబ సభ్యులతో కలసి విహారయాత్ర కోసం అత్యుత్తమ ఎంపిక.

7. శిల్పారామం (Shilparamam)

Places to visit Hyderabad
Places to visit Hyderabad

శిల్పారామం అంటే మట్టి బొమ్మలకు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న పల్లె నాగరికత మొత్తాన్ని బొమ్మల రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. ఎవ్వరైనా సిటీ జీవితం వదిలి ఆలా సరదాగా ఈ పల్లె ప్రదేశానికి వస్తే ఆ కొద్దీ కాలం మనసుకు ప్రశాంతాత లభిస్తుంది.

శిల్పారామం (Shilparamam) హైదరాబాద్‌లోని ప్రముఖ సాంస్కృతిక గ్రామం, ఇది భారతీయ శిల్పకళ, హస్తకళలకు ఒక కేంద్రముగా పనిచేస్తుంది. ఇది మాధాపూర్ ప్రాంతంలో హైటెక్ సిటీ సమీపంలో ఉంది. 1992లో స్థాపించబడిన ఈ సాంస్కృతిక గ్రామం గ్రామీణ భారతదేశపు సంప్రదాయ కళలు, రుచులు, మరియు హస్తకళలను ప్రదర్శించడం కోసం ప్రసిద్ధి చెందింది.

శిల్పారామంలో ఏర్పాటు చేసిన గ్రామీణ మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ మ్యూజియం భారతదేశం యొక్క గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. కూచిపూడి, భరతనాట్యం, మరియు ఇతర నృత్య రూపాలను పర్యాటకులు ఇక్కడ చూస్తారు. సాంప్రదాయ గర్బా మరియు దాండియా రాస్ ప్రదర్శనలు ఉంటాయి. 

శిల్పారామం ప్రత్యేకంగా రాతి శిల్పాల ప్రదర్శనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కళాకారులు ఎంతో నైపుణ్యంతో రాతి శిల్పాలు తయారు చేసి ప్రదర్శిస్తారు. ఈ శిల్పాలు ప్రాచీన భారతీయ కళారూపాల ప్రతిరూపంగా నిలుస్తాయి. 

శిల్పారామంలో పర్యాటకులు గ్రామీణ ఉత్పత్తులు, హస్తకళలు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడి ఉత్పత్తులు పూర్తి చేతిపనితో తయారు చేయబడినవిగా ఉండి, సహజ మరియు నాణ్యమైనవి. పర్యాటకులు ఇక్కడ పచ్చని ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నడిచి, విశ్రాంతి తీసుకోవచ్చు.

శిల్పారామం పర్యాటకులకు భారతీయ సాంస్కృతిక సంపదను అనుభవించడానికి ఒక గొప్ప ప్రదేశం. ఇది హస్తకళలను ప్రోత్సహించడమే కాకుండా, పల్లె జీవితాన్ని, సంప్రదాయాలను, మరియు కళల సౌందర్యాన్ని మనకు చేరువ చేస్తుంది.

8. నెహ్రూ జూలాజికల్ పార్క్ (Nehru Zoological Park)

Places to visit Hyderabad
Places to visit Hyderabad

డిస్కవరీ ఛానల్ లో చూసే జంతువులన్నీ ఇక్కడ నేరుగా చూడవచ్చు. నేరుగా అంటే మనకు వాటికీ ఫ్లెన్చు అడ్డుగా ఉంటుంది. అవి ఆ ఫ్లెన్చ దాటి బయిటికి రావు. భయపడాల్సిన ఆవరసరం లేదు. బయట తిరిగేవి శిక్షణ ఇచ్చినవి, అవి మన మాట వింటాయి.

నెహ్రూ జూలాజికల్ పార్క్ (Nehru Zoological Park) హైదరాబాద్‌లోని ప్రముఖ జంతు ప్రదర్శన స్థలంగా ప్రసిద్ధి చెందింది. జూకి భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పేరు పెట్టారు. 380 ఎకరాల విస్తీర్ణంలో 1959లో స్థాపించబడిన ఈ పార్క్‌ను 1963లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ జూలాజికల్ పార్కులలో ఒకటి, పిల్లలు, కుటుంబాలు, మరియు ప్రకృతి ప్రేమికులు తరచూ సందర్శించే ప్రదేశం.

పార్క్‌లో ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి, ఇవి వివిధ రకాల జంతు జాతులను కలిగి ఉంటాయి. ఇక్కడ ఉన్న ముఖ్యమైన జంతువులలో సింహం, పులి, చిరుత, గుఱ్ఱం, ఏనుగు, జిరాఫీ, జెబ్రా వంటి పెద్ద జంతువులు ఉంటాయి. 160 జాతులకు చెందిన 1,500 పైగా జంతువులు ఉన్నాయి.

నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో సఫారీ రైడ్ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ సింహాలు, పులులు సహజ వాతావరణంలో విహరిస్తుంటాయి, మరియు సందర్శకులు వాటిని సురక్షితంగా జీప్‌లో కూర్చుని దగ్గరగా చూడవచ్చు. చిన్న పిల్లల కోసం చిల్డ్రెన్ ట్రైన్ రైడ్ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇది పార్క్ అంతటా తిరుగుతూ, పర్యాటకులను వివిధ జంతు సెక్షన్లకు తీసుకెళ్తుంది. 

ఈ పార్క్‌లో ఒక ప్రత్యేక రాత్రి జంతు విభాగం ఉంది, దీనిలో రాత్రిపూట చురుకుగా ఉండే జంతువులను చూసేందుకు అవకాశం కల్పించబడింది. ఈ విభాగంలో గొర్రెలు, గుఱ్ఱాలు, మరియు రాత్రి జీవులు ఉన్నాయి. 

జంతువులను నేరుగా చూసే అవకాశం దొరుకుతుంది. జంతు ప్రేమికులకు ఇది మంచి ప్రదేశం. పిల్లలు కూడా ఆడుకుంటూ ఆనందించే ప్రదేశం. తప్పకుండ మీ కుటుంబంతో వెళ్లి చూడండి. 

9. చౌమహల్లా ప్యాలెస్ (Chowmahalla Palace)

Places to visit Hyderabad
Places to visit Hyderabad

హైదరాబాద్ ను పాలించిన రాజుల పాలనలో నిర్మించిన కట్టడం ఇది. ఈ మహాల్ని చూస్తూ ఉంటే పూర్వ రాజుల వైభవం కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి.

చౌమహల్లా ప్యాలెస్ (Chowmahalla Palace) హైదరాబాద్‌లోని ఒక ప్రాచీన రాజభవనం, ఆసిఫ్ జాహీ రాజవంశం యొక్క ఆస్థాన స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇది నిజాం కాలంలో వారు అధికారిక కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించే స్థలం. “చౌమహల్లా” అంటే “నాలుగు మహల్లులు” అని అర్థం. ఈ ప్యాలెస్ నాలుగు భవనల కలయిక. చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణం 1750లలో నిజాం సలాబత్ జంగ్ ప్రారంభించి, నిజాం అఫ్జల్ ఉద్దౌల  సమయంలో 1869లో పూర్తయింది.

ఖిల్వాత్ ముబారక్ (Khilwat Mubarak) ఈ ప్రధాన సభా మందిరం రాజుగా నిలిచిన నిజాం తమ అధికారిక కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న సింహాసనం ఆకర్షణగా ఉంటుంది. ఈ మహల్ మొత్తం పాలరాతి తోనే కట్టారు. ప్యాలెస్‌లో 250 ఏళ్ల నాటి క్లాక్ టవర్ ఉంది, ఇది ఇప్పటికీ పనిచేస్తోంది.

ప్యాలెస్ మధ్యలో ఉన్న ఫౌంటెన్ మరియు పెద్ద పచ్చని తోటలు ఈ ప్రాంతానికి మరింత అందాన్ని ఇస్తాయి. ప్యాలెస్‌లో ఉన్న మ్యూజియంలో నిజాంలు ఉపయోగించిన దుస్తులు, ఆయుధాలు, మరియు ఇతర రాజ సంబంధిత పెయింటింగ్స్ ఉంటాయి. తప్పక సందర్శించాల్సిన ప్రదేశం నిజాములు కట్టిన 4 అద్భుత కట్టడాలను కచ్చితంగా చూడాలి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. బెలీజియం నుంచి తెప్పించిన శాండెర్లు చాల అందంగా అనిపిస్తాయి. 

ప్రవేశ రుసుము: ప్యాలెస్ సందర్శించడానికి ప్రవేశ రుసుము ఉంటుంది, విదేశీ పర్యాటకులకు మరియు భారతీయ పర్యాటకులకు వేర్వేరు ధరలు ఉంటాయి.

సమయాలు: చౌమహల్లా ప్యాలెస్ మంగళవారం నుండి ఆదివారం వరకు తెరిచి ఉంటుంది.

10. లంబిణి పార్క్ (Lumbini Park)

Places to visit Hyderabad
Places to visit Hyderabad

హుస్సేన్ సాగర్ దెగర ఉన్న ఈ లుంబిని పార్క్ చాల అందాలను కలబోసుకుని ఉంటుంది. అక్కడ ప్రదర్శిందే లైట్ షో లు చేసేందుకు రెండు కళ్ళు సరిపోవు. ముఖ్యంగా రాత్రి సమయంలో చాల ఆహ్లాదకరంగా ఉంటుంది.

లంబిణి పార్క్ (Lumbini Park) హైదరాబాద్ నగరంలో ఒక ప్రసిద్ధి చెందిన పబ్లిక్ పార్క్, ఇది హుస్సేన్ సాగర్ సరస్సు పక్కన ఒక ప్రదేశంలో ఉంటుంది. నేపాల్‌లోని బుద్ధ భగవానుడి జన్మస్థలమైన లుంబినీ పేరు మీద ఈ పార్కు పేరు పెట్టారు. ఈ పార్కును 1994లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) అభివృద్ధి చేసింది. ఇది విహారయాత్రలకు, వినోదం కోసం పర్యాటకులు మరియు స్థానిక ప్రజలు ఎక్కువగా సందర్శించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.

లంబిణి పార్క్‌లో లేజర్ షో (Laser Show) చూసేందుకు చాల బాగుంటుంది. ఈ లేజర్ షో బుద్ధ విగ్రహం, తెలంగాణ సంస్కృతి, మరియు భారతదేశ చరిత్రతో పాటు, మ్యూజిక్ మరియు లైట్స్ కలగలిపి చూపిస్తారు. ఇది దేశంలో అత్యంత ప్రసిద్ధ లేజర్ షోలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సాయంత్రం మ్యూజికల్ ఫౌంటెన్ కార్యక్రమం నిర్వహిస్తారు, అందులో నీరు రకరకాల ఆకారాలలో సాగే మ్యూజిక్‌కు అనుగుణంగా కదలడం చూస్తూ సందర్శకులు ఆనందిస్తారు. 

Places to visit Hyderabad

హుస్సేన్ సాగర్ సరస్సులో బోటింగ్ సౌకర్యం లభిస్తుంది. బోటింగ్ చేయడం ద్వారా మీరు సరస్సులో ఉన్న బుద్ధ విగ్రహం దగ్గరికి చేరుకోవచ్చు మరియు పక్కనే ఉన్న అందాలను ఆనందించవచ్చు. ఎవ్వరు ఈ ప్రదేశాన్ని మిస్ చేసుకోవద్దు, రాత్రి పూట అక్కడే ఉండి ఎంజాయ్ చెయ్యండి.

పార్క్‌లో పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆట స్థలాలు కూడా ఉన్నాయి, వీటిలో వివిధ రకాల ఆట వస్తువులు, చిన్న రైడ్‌లు, మరియు వినోదకార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే రోజులలో, ముఖ్యంగా వీకెండ్స్, మరియు పండుగ రోజులలో ఈ పార్క్ సందర్శకులతో కిక్కిరిసిపోతుంది.

పార్క్ ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది, ఇది ఉదయం నడకలకు, సాయంత్రం షికారు చేయడానికి లేదా విశ్రాంతి తీసుకునే వారికీ చాల మంచి ప్రదేశం. 

హైదరాబాద్ మరింత గొప్ప ప్రదేశాలు కలిగి ఉంది, మీరు వీటిని సందర్శించడం ద్వారా నగర చరిత్రను, సాంస్కృతిక వైభవాన్ని ఆనందించవచ్చు.

మరిన్ని ఇటువంటి విహారి ల కోసం తెలుగు రీడర్స్ విహారి ను చూడండి.

You may also like

Leave a Comment